శ్రీకాకుళం జిల్లాలో రేపు 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. సరుబుజ్జిలి, సారవకోట, ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, ఎల్.ఎన్.పేట, పాతపట్నం మండలాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.