BPT: పంగులూరు మండల పరిధిలోని రామకూరులో ఇవాళ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభకు విశేష స్పందన లభించింది. భూ రికార్డుల ప్రక్షాళన, క్షేత్రస్థాయిలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ఆదేశించిన ‘రెవెన్యూ సదస్సు’లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుంచే రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారులు చెప్పారు.