KDP: ఖాజీపేట అగ్రహారానికి చెందిన విద్యార్థిని కీర్తన మృతదేహానికి శనివారం రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నానికి పోస్టుమార్టం పూర్తి కావడంతో వైద్యులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తనాదాలు చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు. రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం అంతా విషాద వాతావరణంతో నిండిపోయింది.