ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్గేట్ వద్ద శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన లారీ ట్యాంకర్ ఓ కారుపై పడిన ఘటన కలకలం రేపింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే వారి పరిస్థితిపై ఇంకా స్పష్టమైన వివరాలు తెలియరాలేదు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.