SRPT: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. శనివారం జాజిరెడ్డిగూడెం మండలం కుంచమర్తిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.