సత్యసాయి: కొత్తచెరువులోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ సందర్శించారు. కేంద్రంలో ఉపాధ్యాయులకు కల్పించిన వసతులపై విద్యాశాఖ అధికారి కృష్ణప్పను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.