అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్తో పాటు ఆస్ట్రేలియా తనకు పౌరసత్వం ఇస్తామని ఆఫర్లు ఇచ్చినట్లు వెల్లడించాడు. అయితే, తాను మాత్రం అఫ్గాన్ తరఫునే అంతర్జాతీయ క్రికెట్ ఆడతానని మరోసారి స్పష్టం చేశాడు. IPL 2023 సీజన్ సమయంలో భారత క్రికెట్ బోర్డుకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తనకు ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చారని తెలిపాడు.