TG: మేడారంలో జరిగిన ప్రమాద ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదని మంత్రి సీతక్క హితవు పలికారు. ప్రత్యర్థులకు ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజల మనోభావాలను కించపరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అంగన్వాడీలకు సెల్ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు.