ఎండాకాలంలో ఎండ తీవ్రత వల్ల చర్మం నల్లగా మారడం (ట్యాన్) సర్వసాధారణం. అయితే, ఈ సమస్యకు మామిడి పండుతో ఇంట్లోనే సులభంగా పరిష్కారం పొందవచ్చు. మామిడి గుజ్జులో శెనగపిండి, బాదం పొడి, తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం మళ్లీ కాంతివంతంగా మారుతుంది. ఈ ప్యాక్ వాడే ముందు ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.