W.G: 2027లో జరగనున్న పుష్కరాల సన్నాహకలపై భీమవరంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఘాట్ల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రహదారి మరమ్మతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తాత్కాలిక మరుగుదొడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.