NDL: కొలిమిగుండ్ల మండల ఇంఛార్జ్ తహసీల్దార్గా నాగేశ్వర రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ ఇంఛార్జ్ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న సాయి విశ్వతేజ పది రోజుల క్రితం సెలవులపై వెళ్లారు. దీంతో ఉన్నతాధికారులు నాగేశ్వర రెడ్డిని కొలిమిగుండ్ల మండలం ఇంఛార్జ్ బాధ్యతలను తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయన విధుల్లో చేరారు.