AKP: నర్సీపట్నంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులతో తహసీల్దార్ లోకవరపు రామారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు నమోదు ప్రక్రియలో రాజకీయ పార్టీ నాయకుల సహకరించాలని సూచించారు. ఓట్లు చేర్పులు, తొలగింపు తదితరు వాటిపై పార్టీ నాయకులు పరిశీలించుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉంటుందని తెలిపారు.