ATP: రామగిరి మండలం పేరూరులో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర’ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే పరిటాల సునీత పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి నిర్దేశిత ప్రాంతాల్లోనే వేయాలని షాపుల నిర్వాహకులు, గ్రామస్తులకు సూచించారు.