CTR: భారత జనగణన-2027లో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు స్వయం గణన, మే 1 నుంచి 30 వరకు ఇంటింటి గణన జరుగుతుందని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. జనగణన సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, బ్యాంక్ వివరాలు అడగరని స్పష్టం చేస్తూ, అలాంటి వివరాలు కోరితే ఇవ్వవద్దని ప్రజలకు హెచ్చరించారు.