కృష్ణా: గన్నవరం ఎస్ఎం కళ్యాణ మండపంలో హజ్ యాత్రికులకు అందుతున్న సదుపాయాల గురించి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హజ్ కమిటీ సభ్యులను శుక్రవారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన నిర్వహిస్తున్న హజ్ యాత్రలో భాగంగా యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.