సత్యసాయి: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాల తీరును మంత్రి సత్యకుమార్ యాదవ్ ‘ప్రజాస్వామ్యానికి చీకటి రోజు’గా అభివర్ణించారు. మహిళల హక్కుల గురించి మాట్లాడే కాంగ్రెస్ కూటమి, బిల్లు విషయంలో ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. దేశ మహిళలకు జరిగిన ఈ ద్రోహాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.