PLD: మండలంలోని మంచికల్లు గ్రామంలో శుక్రవారం జిల్లా పరిషత్ పాఠశాల టీచర్లు, బాలబాలికలు పురవీధుల్లో బడి బాట ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా హెచ్ఎం షీలార్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆదర్శ పాఠశాలలు, ఇంగ్లీషు మీడియం బోధన గురించి తల్లిదండ్రులకు తెలిపారు. విద్యాబుద్దులే కాకుండా నైతిక విలువలతో కూడిన విద్య అందిస్తామన్నారు.