ATP: గుంతకల్లు DLDOగా పనిచేస్తున్న పి.విజయలక్ష్మి పదోన్నతి పొంది, ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే శుక్రవారం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారని జారీ చేసిన ఆదేశాలలో పేర్కొన్నారు.