CTR: నగరి మండలం వి.కె.ఆర్ పురానికి చెందిన దామోదర్ నాయుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆయనను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఇవాళ స్వగృహంలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు నాయకులు, కార్యకర్తలు వచ్చారు.