TPT: తిరుపతి రూరల్ మండలం గాంధీపురం సర్వే నెం. 13లోని 1.9 ఎకరాల భూమి ఆక్రమణపై సీపీఎం ఆధ్వర్యంలో హతిరాంజీ మఠం ఎదుట ధర్నా నిర్వహించారు. 32 మంది పేదలు కొనుగోలు చేసిన భూమిని రామసుబ్బారెడ్డి ఆక్రమించాడని, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని మఠం అదనపు ఈవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.