PPM: జిల్లా కేంద్రంలో ఈ నెల 22 న నిర్వహించబోతున్న మెగా కోలాటం గిన్నిస్ బుక్ ప్రదర్శనకు విద్యార్థులను సన్నద్ధం చెయ్యాలని బలిజిపిట MEO-1సామల సింహాచలం సూచించారు. ఈ మేరకు సోమవారం మండలంలోని హైస్కూల్ HMలు, PD లతో గూగుల్ మీట్ ద్వారా రెండో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి స్కూల్ నుండి 50 మంది విద్యార్థులతో ఒక టీంను తయారు చేయాలన్నారు.