ASR: గూడెంకొత్త వీధి స్థానిక పంచాయతీ కేంద్రంలో గురువారం గ్రామసభ నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి పండ్ర పాల్ తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. గ్రామాల సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకువస్తే ప్రత్యేక తీర్మానాలు చేసి త్వరితగతిన పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.