GNTR: పాతగుంటూరు పోలీస్స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్లో ఓ సెక్యూరిటీ గార్డ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజగోపాల్ అనే వ్యక్తి తన గదిలో మృతదేహంగా కనిపించగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.