SKLM: ఎచ్చెర్ల మండలం కుశాల పురం పారిశ్రామిక వాడలోని ఓషి యానిక్ శాండ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో సంతోశ్ కుమార్ (36) అనే కార్మికుడు మృతిచెందాడు. పరిశ్రమలోని ఓ పోర్కు లిఫ్ట్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో తలకు, ఛాతికి గాయాలయ్యాయి. జాల్లాలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు.