ASR: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పాడేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మచ్చల మంగతల్లి అన్నారు. శుక్రవారం పాడేరులో మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏఎంసీ కృషి చేస్తుందన్నారు.