CTR: రాజధాని విషయంలో వైసీపీలో అయోమయం నెలకొందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి పేర్కొన్నారు. కార్వేటి నగరం మండలం పాదిరి కుప్పంలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజుకో రాజధాని పేరుతో వైసీపీ నేతలు అయోమయం సృష్టిస్తున్నారని వెల్లడించారు. ఈ విషయంలో టీడీపీ అతి ప్రచారం నిర్వహిస్తోందన్నారు.