విశాఖ: వృత్తిపరమైన నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన కారణంగా విశాఖ ఏఎన్ఐ ప్రతినిధి బి. శివరామకృష్ణను ఆ సంస్థ విధుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో ఆయనను ఇకపై రక్షణ శాఖ అధికారిక కార్యక్రమాలకు అనుమతించబోమని డిఫెన్స్ పీఆర్ఓ కమాండర్ సుజిత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన్ని అధికారిక గ్రూపుల నుంచి తొలగించామని చెప్పారు.