BPT: నిజాంపట్నం మండలం పల్లపట్లలో పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు సీడీపీఓ అనసూయ బుధవారం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పరిధిలో ఒక కార్యకర్త, నలుగురు ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 5వ తేదీ లోపు పల్లపట్ల ఐసీడీఎస్ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు.