కర్నూలు జిల్లాలోని 16 ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 2,614 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,327 మంది హాజరైనట్లు డీఈఓ సుధాకర్ తెలిపారు. పెద్దపాడు పాఠశాల సహా పలు కేంద్రాలను ఆయన సందర్శించి, నిర్వహణను పర్యవేక్షించారు. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పరీక్షలు జరిగినట్లు వెల్లడించారు.