మార్కాపురంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యశాలలోని రికార్డులను, హాజరు పట్టికను పరిశీలించారు. స్వయంగా రోగులను అడిగి రోగులకు డాక్టర్లు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి వైద్యశాలకు వస్తున్న రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు.