CTR: మంత్రి నారా లోకేష్ను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సేవలపై చర్చ జరిగింది. పార్టీ బలోపేతంపై కృషి చెయ్యాలన్నారు.