BPT: అద్దంకి మండలం వేలమూరిపాడులో సోలార్ ప్యానెల్స్ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న ప్రారంభించారు. అద్దంకి నియోజకవర్గంలో 6 వేల కుటుంబాలకు ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షల విలువైన యూనిట్లు అందించనున్నారు. రైతులకు కూడా ‘పీఎం కుసుమ్ పథకం’ ద్వారా త్వరలో 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని మంత్రి తెలిపారు. బీసీలకు రూ.98 వేలు, ఓసీలకు రూ.78 వేలు సబ్సిడీ అందిస్తున్నట్లు వెల్లడించారు.