GNTR: తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకమైన రోజు కావడంతో, ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకుని స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.