GNTR: ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు గ్రామపంచాయతీలో ఆదివారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో వేజ్ సీకర్స్ మొబిలైజేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ గ్రామ ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా లభించే ప్రయోజనాలను వివరించారు. ఉపాధి హామీ పనుల్లో పాల్గొని గ్రామాన్ని సస్యశ్యామలంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.