W.G: నరసాపురం (M) ఎల్బిచర్ల బీఆర్ అంబేద్కర్ గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో మార్చి 1న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎన్. శ్యాంప్రసాద్ తెలిపారు. గురుకుల పాఠశాలలో ఆదివారం ఈ ప్రవేశ పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి జాప్యం లేకుండా నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.