దేశంలో 2025-26లో బంగారం దిగుమతులు 24 శాతం పెరిగి ఆల్టైమ్ గరిష్టానికి చేరాయి. మొత్తం 71.98 బిలియన్ డాలర్ల విలువైన పసిడిని మన దేశానికి దిగుమతి చేసుకున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 58 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2023-24లో 45.54 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయ్యింది.