అన్నమయ్య: జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగంపై డ్రోన్లతో నిఘాను మరింత పటిష్టం చేసి, జీరో టోలరెన్స్ విధానంతో కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కూల్ లిప్ అనే నికోటిన్ పదార్థాన్ని పాఠశాలలు, కళాశాలల్లో నిషేధించాలని సూచించారు. ఎన్జీవోల సమన్వయంతో డి-అడిక్షన్ కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. జిల్లా ఎస్పీ పాల్గొన్నారు.