SKLM జిల్లా లో శనివారం ‘స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. ఈ నెల ‘జలం జీవం’ అనే నినాదంతో నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారుల ను శుక్రవారం ఆదేశించారు. వేసవి దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో ఉన్న వర్షపు నీటి ఇంకుడు గుంతలను పునరుద్ధరించాలని సూచించారు