ADB: తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా, అమరుల త్యాగాలను అవమానించేలా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. తేజస్వి వ్యాఖ్యలకు నిరసనగా శనివారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటంతో ఉన్న ఫ్లెక్సీని దహనం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.