ATP: గుంతకల్లులోని పలు కిరాణా దుకాణాలను గురువారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి అకస్మికంగా తనిఖీ చేశారు. మామజి అనే కిరాణా దుకాణ యజమానికి ప్లాస్టిక్ వినియోగిస్తుండడంతో రూ.2000 జరిమానా విధించి ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.