ASR: నాటు సారా కేసుల్లో నలుగురు పాత ముద్దాయిలను ఎక్సైజ్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. దేవీపట్నం, గంగవరం, మారేడుమిల్లి మండలాల్లో పాత కేసులకు సంబంధించి వీరిని పట్టుకున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. నాటు సారా వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.