E.G: కొవ్వూరు మండలంలోని మద్దూరు, మద్దూరులంక, వాడపల్లి, కుమారదేవం, పెనకనమెట్ట, చీడిపి, వేములురు గ్రామాలకు చెందిన 10 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు. మొత్తం రూ.5,53,383 విలువైన చెక్కులను పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.