SRCL: వీర్నపల్లి మండలం బంజేరులో శనివారం ఇంటి ఎదుట పనులు చేసుకుంటున్న గుగులోతు హంసిని గుర్తు తెలియని వ్యక్తి పలకరించి కళ్లలో కారం చల్లి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి అమ్మ అని పలకరించి, కారం పొడిని ఆమె కళ్లలో చల్లాడు. ఈ క్రమంలో మెడలో ఉన్న రూ.3 లక్షల విలువైన బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు.