NLR: నెల్లూరు సంతపేట మార్కెట్లో ఖాళీగా ఉన్న 31 షాపులను కమిషనర్ వై.ఓ. నందన్ ఆధ్వర్యంలో శనివారం లీజుదారులకు కేటాయించారు. లీజుదారులు కరెంటు బిల్లులు చెల్లించాలని, కౌన్సిల్ నిర్ణయించిన మేరకు ప్రతి నెలా అద్దె వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.