కామారెడ్డి జిల్లాలో ఆదివారం ఉదయం 10 గంటలకు డీఎస్ఏ రెజ్లింగ్ హాల్లోని స్విమ్మింగ్ పూల్ వద్ద జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా రెజ్లింగ్ ఛైర్మన్ వినోద్ తెలిపారు. ఈ పోటీలకు 2009–2011 మధ్య జన్మించిన క్రీడాకారులు అర్హులని, పాల్గొనేవారు తమ ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.