KRNL: నందవరం మం. మాచాపురం గ్రామంలో నెలకొన్న తాగునీటి కొరతపై స్పందించిన వైసీపీ పార్టీ నాయకులు తక్షణ చర్యలు చేపట్టారు. సమస్యను మాజీ MP బుట్టా రేణుక దృష్టికి తీసుకెళ్లగా.. తక్షణమే స్పందించిన ఆమె ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ గ్రామంలో బోర్ వేయించి నీటి సమస్యను కొంతవరకు పరిష్కరించారు. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.