E.G: గోదావరి పుష్కరాలు 2027ను దృష్టిలో ఉంచుకొని, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు రాజమండ్రిలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ. 3 కోట్ల వ్యయంతో పిండ ప్రధాన కార్యక్రమాల భవనం, రూ. 70 లక్షలతో నూనె వర్తకుల అన్నదాన సమాజం భవనం పునః నిర్మాణం పనులను దేవదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి, ఎంపీ పురందేశ్వరి కలిసి ప్రారంభించారు.