VZM: జిల్లా పోలీసు శాఖలో డీ.సీ.ఆర్.బీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తూ, గుండె పోటుతో ఆకస్మికంగా మరణించిన ఎ. జగదీశ్వర రావు భౌతికకాయాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ సందర్శించారు. అనంతరం పూలమాల వేసి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. రూ.లక్ష కుటుంబ సభ్యులకు అర్థిక సహాయం అందించారు.