కృష్ణా: నాగాయలంకలో దేవాదాయ శాఖ సీజీఎఫ్ నిధులు రూ.60 లక్షలు, భక్తుల విరాళాలు రూ.30 లక్షలతో నూతనంగా నిర్మించిన శ్రీ భూనీళా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, లిఖిత ఇన్ఫ్రా ఛైర్మన్ గడ్డిపాటి శ్రీనివాసరావు, శీలం అశ్విన్ కుమార్ విచ్చేసి మహోత్సవంలో భాగస్వాములయ్యారు.