KKD: పిఠాపురం మండలంలో మే ఒకటో తేదీ నుంచి జనగణన ప్రారంభం కానుందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో సిబ్బందికి మూడు బ్యాచ్లుగా శిక్షణ ఇచ్చారు. ఈసారి ప్రత్యేక యాప్ ద్వారా వివరాలు సేకరించాలని, ఎన్యుమరేటర్లు ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని సూచించారు. సిబ్బంది సందేహాలను నివృత్తి చేయాలన్నారు.